వెంకట్ హీరోగా.. క్రైమ్ థ్రిల్లర్

వెంకట్ హీరోగా.. క్రైమ్ థ్రిల్లర్

వెంకట్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. రాజ్ తాళ్లూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని ప్రవీణ్ రెడ్డి, వాసుదేవరావ్ నిర్మిస్తున్నారు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. సుచిరిండియా కిరణ్ క్లాప్ కొట్టగా, దర్శకుడు వేణు ఉడుగుల కెమెరా స్విచాన్ చేశాడు. వైవీఎస్ చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. అలీ, నిర్మాత రామ్ తాళ్లూరి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌‌‌‌ అని,  మే 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు చెప్పారు మేకర్స్. రవిందర్ రెడ్డి, ఆదిత్య, మహేష్ విట్ట, వెంకట్, వేద్విక, చాందిని రావు, శుభశ్రీ నటిస్తున్నారు. త్వరలో టైటిల్‌‌‌‌ను ప్రకటిస్తామన్నారు.