హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎలక్షన్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును ఈ నెల 9న వెలువరిస్తామని జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం ప్రకటించారు.
2018లో శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ నుంచి పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో మార్పులు చేశారని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ సీహెచ్ శ్రీనివాసరాజు ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును 9న వెల్లడిస్తామని ప్రకటించింది.