గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యుడు: వెంకయ్య

గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యుడు: వెంకయ్య

గౌతమ్ రెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. గౌతమ్ మృతి అత్యంత విచారకరమంటూ.. ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు. గౌతమ్ ఎంతో సౌమ్యుడని.. ప్రజా సమస్యలపై అవగాహన, పనిచేసే నిబద్దత కలిగిన నాయకుడన్నారు. మేకపాటి కుటుంబంతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. తానంటే ఎంతో అభిమానం చూపే గౌతమ్ రెడ్డి చిన్న వయస్సులోనే దూరం కావడం బాధాకరమన్నారు. గౌతమ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు వెంకయ్యనాయుడు.

మరిన్ని వార్తల కోసం

 

కళావతి’ పాటకు సితార స్టెప్పులు

రీల్ సీఎంగా యడ్యూరప్ప