డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆందోళన

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆందోళన

నిజామాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు డబుల్ బెడ్ రూం బాధితులు ఆందోళనకు దిగారు. ఇండ్లిస్తామని చెప్పి ఏండ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కేటాయించలేదని హమాల్ వాడీ వాసులు ధర్నాకు దిగారు. వెంటనే తమకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్  చేశారు. కేసీఆర్, కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కలగజేసుకొని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కవిత వచ్చి సమాధానం చెప్పే వరకు  కదిలేది లేదని బాధితులు తేల్చిచెప్పారు.

మరిన్ని వార్తల కోసం 

మంచి మనసు చాటుకున్న నిర్మలా సీతారామన్

ఉపాధి పనులకు బొట్టుపెట్టి పిలుస్తున్నరు