హరినాయక్ మృతిపై అనుమానాలు.. వీఎం హోం విద్యార్థుల ఆందోళన

హరినాయక్ మృతిపై అనుమానాలు.. వీఎం హోం విద్యార్థుల ఆందోళన

సరూర్ నగర్ వీఎం హోం విద్యార్థి అనుమానాస్పద మృతిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. హరి నాయక్ మృతిపై నిజానిజాలు తేల్చాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు వీఎం హోంకు తరలించారు. అయితే పోలీసుల తీరుపై సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మండిపడ్డారు. విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నించారు.  హరి నాయక్ మృతిపై అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి  రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.