నిశ్చితార్థ వేడుకలో రింగుకు గ్రాండ్ వెల్ కమ్

నిశ్చితార్థ వేడుకలో రింగుకు గ్రాండ్ వెల్ కమ్

జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భావించే పెళ్లి వేడుకను కొందరు చాలా గ్రాండ్ గా జరుపుకోవాలనుకుంటారు. మరికొందరు వెరైటీగా జరుపుకోవాలని ఆశపడతారు. అదే తరహాలో ఓ జంట కూడా వినూత్న రీతిలో నిశ్చితార్థ వేడుకను జరుపుకుంది. వేలికి పెట్టుకునే ఉంగరాలకు గ్రాండ్ ఎంట్రీ తో వెల్ కమ్ చెప్పి అందర్నీ ఆకర్షించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో ఓ పెద్ద ఉంగరం రిమోట్ సహాయంతో వధూవరులున్న వేదిక వద్దకి వస్తుంది. దగ్గరికి వచ్చిన ఉంగరం పై భాగంలో ఏర్పాటు చేసిన మూత లాంటి భాగాన్ని ఓపెన్ చేసి, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఉంగరాలను తీసుకున్నారు.

ఈ వీడియోను  ముంబయికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. కాగా అందర్నీ ఆకర్షిస్తోన్న ఈ వీడియోకు కొంత మంది డబ్బు వృధా అని కామెంట్ చేస్తే... మరికొందరేమో.. ఉంగరం ఎంట్రీకి బాగానే ఖర్చు చేశారు గానీ.. దానికి బదులుగా వేడుకకు వచ్చిన బంధువులకు కుర్చీలను ఏర్పాటు చేస్తే బాగుండేదని రిప్లై ఇచ్చారు. మరొకరేమో "ఇది ఎంట్రీ కాదు. నేను దీనిని తమాషా అని పిలుస్తాను"  అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.