మూడేళ్ల చిన్నారిని రైల్వే పట్టాలపైకి తోసేసిన యువతి

మూడేళ్ల చిన్నారిని రైల్వే పట్టాలపైకి తోసేసిన యువతి

యునైటెడ్ స్టేట్స్‌లోని ఒరెగాన్‌లో ఓ మహిళ  చిన్నారిని రైలు పట్టాలపైకి నెట్టేసింది. ఈ ఘటనకు సంబంధించిన  దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.  ఈ సంఘటన బుధవారం (డిసెంబర్ 28) జరిగింది. ఈ వీడియో క్లిప్‌ను ముల్ట్నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. 3 సంవత్సరాల ఓ చిన్నారి ప్లాట్‌ఫారమ్‌పై తన తల్లితో రైలు కోసం వేచి ఉండగా... ఓ అపరిచితురాలు ఆమెను రైల్వే లైన్‌పైకి తోసేసింది. చిన్నారిని పట్టాల పైకి తోసేసింది. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని 32 ఏళ్ల బ్రియానా లేస్ వర్క్‌మెన్‌గా అధికారులు గుర్తించారు. 

ఈ ఘటనలో చిన్నారి తలకు, నుదురు భాగంలో స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్న ఇతర వ్యక్తులు వెంటనే స్పందించి,రైలు పట్టాలపై పడిన ఆ చిన్నారిని పైకి లేపారు. రైలు రాకముందే ఆ చిన్నారిని సురక్షితంగా ప్లాట్‌ఫారమ్‌పైకి లాగారు. అయితే ఈ పనిని ఆ యువతి ఎందుకు చేసిందో కారణాలు మాత్రం తెలియరాలేదు. ముల్త్నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ప్రకారం, దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు పాల్పడిన నిందితురాలిని కస్టడీలో ఉంచాలని, బెయిల్ లేకుండా జైలు శిక్ష విధించాలని కోర్టును అభ్యర్థించినట్లు న్యాయవాది కార్యాలయం తెలిపింది.