తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TFJA)..సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ ఏ కష్టం వచ్చిన స్పందించే వారధి. విజయవంతంగా రెండు దశాబ్దాలను పూర్తి చేసుకున్న తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. అలాగే ఈవెంట్కి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పాల్గొని విజయవంతం చేశారు.
ఈ సందర్బంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'ఇవాళ జర్నలిస్టుల హెల్త్ కార్డుల సెలబ్రేషన్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్ మొదటి నుంచీ జర్నలిస్టులు నా సినిమాలను ముందుకు నడుపుతూ ఉన్నారు. శ్రీనివాసరెడ్డిగారు ఇన్ని మాట్లాడుతుంటే నాకు చాలా విషయాలు తెలిశాయి. ఆయన చాలా స్ట్రాంగ్ గైడ్ అనిపిస్తోంది. అలాగే జర్నలిస్టులకు శ్రీనివాసరెడ్డిగారు ల్యాండ్లు ఇప్పిస్తే, అందరూ ఆనందంగా ఉంటారని విజయ్ అన్నారు.
అంతేకాకుండా..నేను కాలేజ్లో ఉన్నప్పుడు మెడికల్ బిల్లులు ఎక్కువ వస్తాయేమోనని భయపడి హెల్త్ ఇన్స్యూరెన్స్ లు తీసుకునేవాడిని. కానీ, వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా సరిగా తెలిసేది కాదు. కొన్నిసార్లు రెన్యువల్కి డబ్బులు ఉండేవి కాదు. అలా ఎన్నిటినో వదిలేశాను. ఇప్పుడు ఈ అసోసియేషన్ ద్వారా అందరూ ఈ ఇన్సూరెన్స్ లని వినియోగించుకుంటున్నారని తెలిసి చాలా ఆనందం వేసింది. జీవితంలో ఎవరికైనా మూడే ముఖ్యం. ఒకటి ఆరోగ్యం, రెండు ఆనందం, మూడు డబ్బు. ఈ మూడిటిలో ఏది ఉన్నా, ఇంకోటి ఉంటుంది. ఉండి తీరుతుంది. జీవితంలో ఈ మూడు ఉంటాయని హీరో విజయ్ దేవరకొండ వెల్లడించారు.
నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ..'యూనియన్కి నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది. మీ ఇన్స్యూరెన్స్ మొదటడుగు వేయించింది నేనే అని నా తెలిసి గర్వంగా ఉంది. హెల్త్ కోసం ఇవాళ తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు చేస్తున్న ఈ కార్యక్రమం చూస్తుంటే ఆనందంగా ఉంది. అందరికీ శుభాకాంక్షలు అని తెలిపారు.
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ..'జర్నలిస్టులకు ఇళ్లను ఫ్రీగా ఇప్పించండి. స్థలాలను రేవంత్రెడ్డిగారిని అడగండి. ఇళ్లు మీరు కట్టుకోండి. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిగారు స్థలాలను ఇప్పించి పుణ్యం కట్టుకోవాలి. ఎందుకంటే ''తుపాకి కన్నా కలానికి భయపడతానని అన్నారు నెపోలియన్. ఎంతో మంది జర్నలిస్టులను కన్నది సినిమా తల్లి అని ఈ సందర్బంగా నారాయణమూర్తి గుర్తు చేశారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..'జర్నలిస్టులుగా మనం ప్రజల పక్షాన పనిచేస్తున్నామనే భావన జనాలకు కలగజేయాలి. తెలంగాణలో 23వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారు. ప్రతి సంస్థలోనూ ఫిల్మ్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా అక్రిడేషన్ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. ఇళ్ల స్థలాలను ఇస్తామని గత ప్రభుత్వం ఎన్నోసార్లు ఆశపెట్టింది. అది ఇప్పటికీ నెరవేరలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తారన్న ఆశ ఉంది. ఎలిజెబుల్ పీపుల్కి కచ్చితంగా అక్రిడేషన్ ఇప్పిస్తాం. 40 ఏళ్ల అక్రిడేషన్కి క్రితం రూల్స్ పెట్టినప్పుడు, ఆ తర్వాత మార్పు చేసినప్పుడు కూడా నాకు తెలుసు. ప్రభుత్వాల నుంచి ఏ సౌకర్యాలు పొందాలన్నా అందరిలోనూ యూనిటీ ఉండాలి. అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే. మన ప్రొఫెషన్ విలువ, స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం, ఎథిక్స్ ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది. జూన్ 6 తర్వాత ఎలిజిబుల్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు అందించే ప్రయత్నం చేస్తామని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA)
సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం TFJA. ఈ ఏడాదిలో అసోషియేషన్ అసోషియేషన్ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తోంది. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు ఆరోగ్య భీమా సౌకర్యం ఉంటుంది.
టర్మ్ పాలసీ విషయానికి వస్తే..
ప్రతి సభ్యుడికి రూ.15 లక్షలు, యాక్సిడెంటల్ పాలసీ సభ్యుడికి రూ.25 లక్షలను అందేలా చర్యలు తీసుకున్నారు.ఈ ఏడాది (2024-25) వరకూ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డ్స్ ను అందించడం జరిగింది.