న్యూఢిల్లీ: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయం సాధించింది. భారీ టార్గెట్ ఛేజింగ్లో తన్మయ్ అగర్వాల్ (119 బాల్స్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 124), రోహిత్ రాయుడు (83) చెలరేగడంతో.. మంగళవారం జరిగిన గ్రూప్–ఎ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌరాష్ట్ర 50 ఓవర్లలో 312/9 స్కోరు చేసింది. హార్విక్ దేశాయ్ (120 బాల్స్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 102) సెంచరీతో రాణించాడు. చేతన్ సకారియా (36 నాటౌట్), జైదేవ్ ఉనాద్కట్ (30), అర్పిత్ (28) ఫర్వాలేదనిపించారు.
హైదరాబాద్ బౌలర్లలో సంకేత్ 4, అనికేత్ 3 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 48.5 ఓవర్లలో 314/5 స్కోరు చేసింది. తన్మయ్, రోహిత్ తొలి వికెట్కు 214 రన్స్ జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తిలక్ వర్మ (45), రవితేజ (34) అండగా నిలిచారు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, ధర్మేంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.