ఆర్బీఐ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్) బోర్డుకు విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ పై ఆర్బీఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. మార్చి 15న తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీసెస్ రద్దు చేయబడతాయని ఆర్బీఐ గడువ విధించగా... ఆ గడువుకు ముందే ఆ రోజు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ ఫౌండర్, ఛైర్మన్ విజయ్ శేఖర్ తన రాజీనామా చేసిన అంశాన్ని రెగ్యులేటరీ సంస్థలకు తెలిపారు. ఇదిలా ఉండగా, పీపీబీఎల్ కు కొత్త చైర్మన్ ను నియమిస్తామని వన్97 కమ్యూనికేషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.