కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం : విజయా రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం : విజయా రెడ్డి

ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ పి. విజయా రెడ్డి అన్నారు. మంగళవారం ఫిలింనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పథకాలు అమలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విజయా రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల కుట్రలను తిప్పికొడుతూ మహిళలకు ఎంతో లబ్ధిచేకూర్చే గృహ జ్యోతి, సబ్సిడీ గ్యాస్ పథకాలను నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించేలా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆమె పిలునిచ్చారు. 

పార్టీ ఇచ్చిన హామీల్లో ఇప్పటికే  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందని ఆమె అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పథకాల పట్ల మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసే విధంగా ప్రభుత్వం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పి. మోహన్ యాదవ్, శ్యామ్, ధన్ రాజ్ రాథోడ్, బల్లు రాథోడ్, ప్రియాంక, మహేందర్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.