కబడ్డీ టోర్నమెంట్ లో ప్రమాదం.. రెండు ప్రధాన తప్పిదాలు

కబడ్డీ టోర్నమెంట్ లో ప్రమాదం.. రెండు ప్రధాన తప్పిదాలు

కరోనా కట్టడిలో తెలంగాణ సర్కారు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు బీజేపీ నేత విజయశాంతి. ఏ పని చేసినా అరకొరగానే ఉంటుందనడానికి రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్ని చూస్తే అర్థమవుతుందన్నారు. విద్యార్థుల్లో కరోనా వ్యాపిస్తున్నందున వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు  విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు.. కానీ, మిగిలిన చోట్ల కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. సూర్యాపేటలో సోమవారం చాలామంది గాయాలపాలైన కబడ్డీ పోటీల నిర్వహణ తీరు చూస్తే ప్రధానంగా రెండు తప్పులను అందరూ ఎత్తి చూపుతున్నారన్నారు. పోటీల్లో కోవిడ్ నియంత్రణ చర్యలేవీ తీసుకోలేదు సరి కదా... గ్యాలరీ సామర్థ్యాన్ని పరీక్షించడంలో నిర్వాహకులు, అధికారులు విఫలమయ్యారని అన్నారు. ఈ ఒక్క చోటే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కోవిడ్ కట్టడికి తగిన చర్యలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదన్నారు. అధికారులకు సరైన మార్గదర్శకాలు ఇచ్చి పరిస్థితి అదుపు  చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని పరిస్థితుల్ని చూసైనా తెలంగాణ సర్కారు మేలుకోకుండా ఈ పాలకుల పాపాన్ని ప్రజలు అనుభవించాల్సి వస్తుందేమోనన్నారు.