బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే..అందుకే రాజీనామా చేశా : విజయశాంతి

 బీఆర్ఎస్,  బీజేపీ ఒక్కటే..అందుకే రాజీనామా చేశా : విజయశాంతి

బీఆర్ఎస్,  బీజేపీ ఒక్కటేనని అన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి. సీఎం కేసీఆర్ అవినీతిపై  ఆధారాలున్న ఎందుకు చర్యలు తీసుుకోవడం లేదని  ప్రధాని మోదీని ప్రశ్నించారు.   ఆ పార్టీలు తెర ముందు విమర్శలు, తెర వెనక ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు.  మధ్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పిచ్చోళ్లని అన్నారు.  కేసీఆర్ సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగిందని ఆరోపించారు.  అందుకే తాను బీజేపీకి రాజీనామా చేశానని చెప్పారు విజయశాంతి. 

తన రాష్ట్రమే తనకు ముఖ్యమని అనుకోని రాజకీయాల్లో ఉన్నానని అన్నారు విజయశాంతి.  కేసీఆర్ ను ఎదురించడానికి బీజేపీలోకి వెళ్ళానని చెప్పిన ఆమె..ఆ తర్వాత కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మెల్లగా అర్ధమైందన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా తెలంగాణకు వచ్చినప్పుడు విమర్శలు చేయడం వదిలేయడం ఇదో తంతుగా మారిందన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన విజయశాంతి..  కేసీఆర్ అవినీతిని కక్కిస్తుందన్నారు.  కాంగ్రెస్ లో తన పాత మిత్రులను కలుసుకోవడం అనందంగా ఉందన్నారు.  బీఆర్ఎస్ ను గద్దెదించే పార్టీతోనే తాను నడుస్తానన్నారు.  రాష్ట్రంలో, కేంద్రంలో అధికార మార్పు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read :- కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు: హరీష్​ రావు