మోసాలకు ప్రతిరూపమే కేసీఆర్

మోసాలకు ప్రతిరూపమే కేసీఆర్

మోసాలకు ప్రతిరూపమే సీఎం కేసీఆర్ అన్నారు బీజేపీ నేత విజయశాంతి. మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టుల్లో నిర్వాసితులకు షెల్టర్ ఇవ్వకుండా తన్ని తరిమేశారన్నారు. కాళేశ్వరం నుంచి రైతుల పొలాలకు ఒక్క చుక్క నీరు రాలేదన్నారు. బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు తీసుకుని నాణ్యతలేని చీరలిచ్చారని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల ఫ్యామీలి రాజ్యామేలుతుందన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన ప్రచారంలో ఆమె మాట్లాడారు.