కాంగ్రెస్ అనేది ఒక పెద్ద ప్యాకేజ్ పార్టీ : విజయశాంతి

కాంగ్రెస్ అనేది ఒక పెద్ద ప్యాకేజ్ పార్టీ : విజయశాంతి

సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సీట్లు తగ్గుతాయన్న సంకేతాలతో కేసీఆర్  కాంగ్రస్ ను లేపే పనిలో ఉన్నారని ధ్వజమెత్తారు. మోడీ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ డివిజన్ లో ఇంటింటికి బీజేపీ భరోసా యాత్ర పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పాదయాత్రను ప్రారంభించారు. 

కాంగ్రెస్  నుంచి గెలిచిన నేతలను బీఆర్ఎస్ లో  విలీనం చేసుకునే దిశగా కేసీఆర్  వ్యూహాలు రచన చేస్తున్నారని విజయశాంతి విమర్శించారు. కాంగ్రెస్ అనేది ఒక పెద్ద ప్యాకేజ్ పార్టీ అని 2018లో గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా అమ్ముకుందో ప్రజలందరికీ తెలుసని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలు చెప్పుకోవాల్సింది పోయి వేడుకల పేరుతో ప్రజల సొమ్మును అప్పనంగా ఖర్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

ALSO READ:బీజేపీ, బీఆర్ఎస్ ల అక్రమ మైత్రి ఎంతదాచినా దాగదు: షర్మిల