సీఎం కేసీఆర్ కు ప్రజల కన్నా ఎన్నికలే ముఖ్యమా

సీఎం కేసీఆర్ కు ప్రజల కన్నా ఎన్నికలే ముఖ్యమా

దేశంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు బీజేపీ నేత విజయశాంతి. దయచేసి అందరూ జాగ్రత్తలు పాటించండి..టీకాలు వేయించుకోవాలన్నారు. వరంగల్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన విజయశాంతి.. కరోనా విజృభిస్తున్నా కూడా ఎన్నికలు ప్రచారాలు,సభలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ కు ప్రజల కన్నా ఎన్నికలే ముఖ్యమా అని ప్రశ్నించారు.

హాలియా సభతో ఎంతో మందికి కరోనా వచ్చిందన్నారు విజయశాంతి. తాను ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉంటూ, సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలి అనుకుంటున్నానని తెలిపారు. వరదలతో వరంగల్ ప్రజలు ఎంతో నష్ట పోయారని. సీఎం కేసీఆర్ ఎక్కడ అయినా కుర్చీ వేసుకొని కూర్చుంట అంటారు కదా.. మరి వరంగల్ లో ఎన్నిసార్లు కూర్చున్నారని ప్రశ్నించారు.  ఆయనకు కావాల్సింది ఓటుకు నోటు, కాంట్రాక్టులు, కమిషన్లు అని ఆరోపించారు.

వరంగల్ లో 3 వేల డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు..3 వేలు కాదు కదా కనీసం 3వందల ఇల్లు కూడా ఎవరికీ ఇవ్వలేదన్నారు విజయశాంతి. టీఆర్ఎస్ నేతల పని తక్కువ ప్రచారాలు ఎక్కువ అని అన్నారు. సీఎం కేసీఆర్ తప్పుడు హామీలు, డబ్బు, మద్యంతోనే గెలుస్తున్నాడని తెలిపారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమే నని అన్నారు విజయశాంతి. బీజేపీ గెలుపుతోనే వరంగల్ అభివృద్ధి చెందుతుందన్నారు.