ప్రభుత్వ భూమి మాదంటే మాదంటూ... పొలంలోనే కర్రలతో కొట్టుకున్న రైతులు

ప్రభుత్వ భూమి మాదంటే మాదంటూ... పొలంలోనే కర్రలతో కొట్టుకున్న రైతులు

వికారాబాద్ జిల్లాలో భూ తగాదాలు భగ్గుమన్నాయి.  దోమ మండలం గుండాల గ్రామంలో ప్రభుత్వ భూమి విషయంలో రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రైతులకు  తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  వీరిలో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది.

204 సర్వే నంబర్ లోని దాదాపు మూడెకరాల పొలం విషయంలో రైతు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఓ వర్గం రైతులు 60 ఏళ్ళుగా భూమి తామే సాగు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ మరో వర్గం రైతులు తమ భూమిని దౌర్జన్యంగా లాక్కుని అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సర్వేలోని భూమి తమదేనని తేలిందని మరో వర్గం రైతులు చెబుతున్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే..ఓ వర్గం రైతులకు బీఆరెస్స్ నాయకులు.... మరో వర్గం రైతులకు  కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేస్తుండటంతో  ఈ భూ సమస్య కాస్తా రాజకీయ పోరుగా మారింది.