
వికారాబాద్, వెలుగు: పరిపాలనా సరిహద్దుల డేటాబేస్(ఏబీడీబీ) లో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా వికారాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని సర్వే ల్యాండ్రికార్డ్స్జిల్లా అధికారి ఎం.రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల సరిహద్దులను సర్వే చేయాలని నిర్ణయించిందన్నారు. గురువారం వికారాబాద్ మండలంలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు.