పక్కింటి వాళ్లతో .. ఎదురింటి వాళ్లతో గొడవలు జరగడం కామన్. చిన్న చిన్న భేదాభిప్రాయాలతో గొడవ పడుతుంటారు. మురికి నీరు వస్తుందని.. చెత్త పడుతుందని ఒకరినొకరు పెట్టుకుంటారు. కొన్ని చోట్ల కొట్టుకున్ సందర్భాలు కూడా చూశాం... మళ్లీ కొన్ని రోజులకు మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అయితో ఓ వ్యక్తి ఏకంగా ఎదురింటి వారితో గొడవ పడి సీసీ రోడ్డుపై అడ్డంగా గోడ కట్టేశాడు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో జరిగింది.
గ్రామానికి చెందిన కిలారు చంద్ర శేఖర్, కిలారు లక్ష్మీ నారాయణ ఇండ్లు ఎదురెదురుగా ఉంటాయి. రెండిళ్ల మధ్య సీసీ రోడ్డు ఉంటుంది. వీరిద్దరికి గత కొన్ని రోజులుగా గొడవ జరుగుతోంది. ఊరి పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ కూడా జరిగింది. ఇటీవల ఈ గొడవలు కాస్త పెద్దవయ్యాయి. ఇటీవల చంద్రశేకర్ తన ఇంటి ముందు మురికి కాలువపై మెట్టు కట్టారు. దీంతో లక్ష్మీనారాయణ ఏకంగా తన ఇంటి ముందున్న సీసీరోడ్డు మధ్యలో గోడ కట్టేశాడు. ఈ విషయంపై పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని చంద్రశేఖర్ చెబుతున్నాడు.
గొడవలు జరిగితే పంచాయతీ పెట్టి మాట్లాడుకోవాలి కానీ.. ఇలా రోడ్డుపై రోడ్డు వేయడం ఏంటని గ్రామస్థులు ముక్కున వేలేసుకుంటున్నారు.