ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు

ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు

యాదగిరిగుట్ట, వెలుగు :  ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి, మల్లాపురం సోమవారం ఆఫీసర్లు చేస్తున్న సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు మరోచోట భూమి కేటాయిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే సర్వే చేయాలన్నారు. ఇప్పటికే యాదగిరిగుట్ట అభివృద్ధి, కాళేశ్వరం కాల్వల కోసం భూములు ఇచ్చామని, మళ్లీ ఇప్పుడు ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటూ భూములు తీసుకుంటే తాము తీవ్రంగా నష్టపోతామన్నారు. భూమిని భూమి ఇచ్చే విషయంపై క్లారిటీ వచ్చాకే సర్వేకు రావాలని స్పష్టం చేశారు. గ్రామస్తులు ఆఫీసర్లను అడ్డుకున్న విషయం తెలుసుకున్న యాదగిరిగుట్ట తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాములునాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలతో మాట్లాడారు. అయినా వారు వినకపోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.

ఆలేరు ఎమ్మెల్యేకు వినతి

యాదాద్రి, వెలుగు : ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ భూములు పోకుండా చూడాలని రాయగిరికి చెందిన పలువురు రైతులు సోమవారం మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుంటలో సఖి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకుస్థాపనకు వస్తున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి వినతిపత్రం ఇవ్వాలని భావించారు. అయితే మంత్రి హాజరుకాకపోవడంతో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొంగిడి సునీతకు  వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. శంకుస్థాపన జరిగే స్థలం వద్దకు బాధితులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమం ముగియగానే ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొంగిడి సునీత, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి నేరుగా బాధితుల వద్దకు వచ్చారు. భువనగిరి ఎమ్మెల్యే మాత్రం పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధితులు చేసేదేమీ లేక ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సునీతకు వినతిపత్రం అందజేశారు.