జనగామ రూరల్(లింగాల ఘణపురం), వెలుగు: తమ గ్రామానికి చెందిన స్టూడెంట్స్ను ప్రైవేట్ స్కూళ్లకు పంపించబోమని లింగాలఘణపురం మండలం నేలపోగుల సర్పంచ్ దూసరి గణపతి చెప్పారు. గురువారం గ్రామం నుంచి వెళ్తున్న పలు ప్రైవేట్ స్కూళ్ల బస్సులను గ్రామస్తులతో కలిసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మన ఊరు, మన బడి స్కీంకు.. తమ స్కూల్ఎంపికైందని, పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లు, పేరెంట్స్కు మాయమాటలు చెప్పి, పిల్లలను తమ స్కూళ్లలో చేర్పించుకుంటున్నాయని ఆరోపించారు.