ప్రైవేటు స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు

 ప్రైవేటు స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు

జనగామ రూరల్(లింగాల ఘణపురం), వెలుగు: తమ గ్రామానికి చెందిన స్టూడెంట్స్​ను ప్రైవేట్​ స్కూళ్లకు పంపించబోమని లింగాలఘణపురం మండలం నేలపోగుల సర్పంచ్​ దూసరి గణపతి చెప్పారు. గురువారం గ్రామం నుంచి వెళ్తున్న పలు ప్రైవేట్​ స్కూళ్ల బస్సులను గ్రామస్తులతో కలిసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్​ మాట్లాడుతూ.. మన ఊరు, మన బడి స్కీంకు.. తమ స్కూల్​ఎంపికైందని, పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లు, పేరెంట్స్​కు మాయమాటలు చెప్పి, పిల్లలను తమ స్కూళ్లలో చేర్పించుకుంటున్నాయని ఆరోపించారు.