నిజామాబాద్ లో ఉత్సాహంగా వినాయకుడి ఉత్సవాలు

నిజామాబాద్ లో ఉత్సాహంగా వినాయకుడి ఉత్సవాలు

నిజామాబాద్ అర్బన్, వెలుగు: నగరంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్​పాల్ ​సూర్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ఆయన నగరంలోని పలు వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిమజ్జన ఉత్సవంలో  సైతం భక్తులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.