కూరలో ఉప్పు ఎక్కువైంది : రెస్టారెంట్ లో ఫైటింగ్..

కూరలో ఉప్పు ఎక్కువైంది : రెస్టారెంట్ లో ఫైటింగ్..

ఆహారంలో ఉప్పు ఎక్కువైందని అన్నందుకు ఓ కస్టమర్​పై రెస్టారెంట్​ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కస్టమర్​ దేశ రాజధానిలోని ఓ రెస్టారెంట్​లో ఫుడ్​ తినడానికి వచ్చాడు. 

అతనికి వడ్డించిన ఫుడ్​లో ఉప్పు మోతాదు ఎక్కువైంది. ఆగ్రహించిన కస్టమర్​ సిబ్బందిని నిలదీశాడు. సిబ్బందికి అతనికి మధ్య మాటా మాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. 

ALSO READ l: తమ కంటే ముందు ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేశారని కొడవళ్లతో దాడి

విచక్షణ కోల్పోయిన సిబ్బంది కస్టమర్​పై దాడికి దిగారు. కస్టమర్​సైతం ప్రతి దాడి చేశాడు. ఈ దాడిలో కస్టమర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. చుట్టూ ఉన్నవారు కనీసం గొడవను ఆపడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.