దక్షిణ భారత ఆహారాల్లో ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకునే అల్పాహారాల్లో దోశ ఒకటి. మసాలా దోశ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ.. ఇలా దోశల్లో పలు రకాల దోశల గురించి విని ఉంటాం. కానీ కొత్తగా ట్రెండ్ అవుతున్న సెవ్ దోశ గురించి విన్నారా.. బీన్స్ తో తయారయ్యే ఈ ఫుడ్.. సెవ్ పూరీ దోశగా వైరల్ అవుతోంది.
ఈ కొత్త రకమైన దోశకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుండగా.. ఇందులో ఒక వ్యక్తి దోశలో చాట్ని కలుపుతున్నట్టు కనిపిస్తోంది. నెటిజన్లను అత్యంత ఆకట్టుకునే ఈ దోశ తయారీ ఫుటేజీలో సెవ్ పూరీ ప్లేట్ను దేశీ డిష్లో మెత్తగా రుద్దుతున్నట్లు కూడా ఈ క్లిప్ లో చూడవచ్చు. ఆ తర్వాత దీన్ని చీజ్, మరికొంత సెవ్తో డెకరేట్ చేసి, చట్నీ, సాస్తో వ్యాపారి, కస్టమర్లకు అందిస్తాడు.
దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినందున, నెటిజన్లు ఈ స్పెషల్ ఫుడ్ వెరైటీపై పలు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈ వంటకాన్ని ప్రయత్నించడానికి ఇష్టపడకపోగా, మరికొందరు డిస్లైక్ బటన్ కోసం చూశారు. "దోస క్రిస్పీగా ఉంటే ఈ షడ్ రుచి బాగుంటుంది" అని ఒక యూజర్ బదులిచ్చారు.