ఉత్తరాఖండ్ వెకేషన్లో కోహ్లీ..నెట్టింట ఫొటోలు వైరల్

ఉత్తరాఖండ్ వెకేషన్లో కోహ్లీ..నెట్టింట ఫొటోలు వైరల్

స్టార్ కపుల్ కోహ్లీ – అనుష్క శర్మ వెకేషన్ మోడ్ను ఎంజాయ్ చేస్తున్నారు. తమ కూతురు వామికతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లారు. ప్రసిద్ధ కంచి ధామ్ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 

టీ20 వరల్డ్ కప్ లో అదరగొట్టిన కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్ ల నుంచి అతడికి రెస్ట్ ఇచ్చారు. డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగే మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కు కోహ్లీ అందుబాటులోకి రానున్నారు. బంగ్లాదేశ్‌ తో భారత్ 2 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది.