ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన విరాట్

ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన విరాట్

కింగ్ కోహ్లీ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ 13వ సీజన్‌ లో విరాట్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో టాస్ వేయడంతోనే ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డు నమోదు చేశాడు. టీ 20 క్రికెట్‌లో ఒకే టీమ్ కు అత్యధికంగా కేప్టెన్‌గా ఉన్న ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ నిలిచాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కోసం కోహ్లీ 197వ మ్యాచ్‌ కు హాజరయ్యాడు. సోమర్‌ సెట్ తరఫున 196 టీ 20 మ్యాచ్‌ లు ఆడిన జేమ్స్ హిల్డ్రెత్‌ ను విరాట్‌ కోహ్లీ బ్రుక్ చేశాడు.

జేమ్స్‌ హిల్డెత్‌ తర్వాత మహేంద్రసింగ్‌ ధోని, సమిత్ పటేల్ మూడో స్థానంలో ఉన్నారు. ఇద్దరూ వరుసగా చెన్నై సూపర్ కింగ్స్, నాటింగ్హామ్‌ షైర్ కొరకు 189 మ్యాచులు ఆడారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ ఆరంభంలో ఫామ్‌కు దూరంగా ఉన్న కోహ్లీ.. రాజస్థాన్ రాయల్స్‌పై అజేయంగా 72 పరుగులు చేసి తన టీమ్ ను ఎనిమిది వికెట్ల విజయానికి నడిపించాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన ఆర్‌సీబీ మూడు విజయాలు సాధించిన విషయం తెలిసిందే.