కోహ్లీ కి పరిణతి లేదు: కగిసో రబాడ

కోహ్లీ కి పరిణతి లేదు:  కగిసో రబాడ

న్యూఢిల్లీ: ఇండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీని పరిణతి లేని వ్యక్తిగా సౌతాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ అభివర్ణించాడు. ఐపీఎల్ మ్యాచ్‌ లో కోహ్లీతో జరిగిన సంవాదాన్ని గుర్తు చేసుకున్నాడు. ముందుగా కోహ్లీ కవ్వింపుకు దిగుతాడని, దీనికి బదులిస్తే తనకు కోపమోస్తుందని తెలిపాడు. ‘ఆ మ్యాచ్‌ లో నేను గేమ్‌ ప్లాన్‌‌ గురించి ఆలోచిస్తున్నా . నా బౌలింగ్‌ లో బౌండ్రీ కొట్టిన అనంతరం కోహ్లీ ఏదో మాట అన్నాడు. దానికి నేను బదులిచ్చాక అతనికి కోపమోచ్చింది. కోహ్లీ ప్రవర్తన పరిణతి లేనిదిగా అనిపించింది. విరాట్ అద్భుతమైన ఆటగాడు కాని ఎవరైనా ఏదైనా అంటే, తిడితే తట్టుకోలేడు. తనెప్పుడూ మైదానంలో చాలా కోపంగా కన్పిస్తాడు. ఆ ఘటన జరిగాక బస్సులో వెళుతుండగా తన గురిం చే ఆలోచించాను. అయినా ఎప్పుడూ అంతకోపంగా ఉంటే ఏమస్తుం ది’ అని రబాడ వ్యాఖ్యానిం చాడు. కాగా, ఐసీసీ అవార్డులో తనను అధిగమించి ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ , టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ లను కోహ్లీ పొందడానికి అన్నివిధాలుగా అర్హుడని  పేర్కొన్నా డు.