బాధిత కుటుంబాలకు వివేక్​ పరామర్శ

బాధిత కుటుంబాలకు వివేక్​ పరామర్శ

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి బుధవారం పర్యటించారు.  ఈ సందర్బంగా ఆయన పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు బుర్ర రాము ఇటీవల చనిపోగా ఆయన కుటుంబాన్ని వివేక్​ పరామర్శించారు.

ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వివేక్​ అభిమాని పల్లె ప్రశాంత్​ నాయనమ్మ శేషమ్మ ఇటీవల చనిపోయారు. వారి కుటుంబాన్ని మాజీ ఎంపీ పరామర్శించారు. ఆయన వెంట లీడర్లు గొట్టిముక్కుల సురేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సయ్యద్​ సజ్జద్, సదయ్యగౌడ్​, సతీశ్, శ్రీనివాస్​, సంతోష్​ తదితరులు ఉన్నారు.