మత్సకారులకు వలలు అందజేసిన వివేక్ వెంకటస్వామి

మత్సకారులకు వలలు అందజేసిన వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల : సీఎం కేసీఆర్ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. రూ.30వేల కోట్ల ప్రాజెక్టు అంచనాను లక్ష కోట్లకు పెంచారని విమర్శించారు. వరదల వల్ల కలిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా కాంట్రాక్టర్ భరించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నష్టాన్ని  ప్రజలపై వేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

అంతకు ముందు జైపూర్ మండల వేళాల గ్రామంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ వరదల కారణంగా వలలు కొట్టుకుపోయిన మత్స్యకార కుటుంబాలనువివేక్ వెంకటస్వామి పరామర్శించారు. 15మంది మత్స్యకారులకు వలలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఇంఛార్జ్ అందుగుల శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు.