వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మంత్రి కేటీఆర్ ఓటీటీలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి విమర్శించారు సమస్యలపై ఇంటి దగ్గర నుంచే రివ్యూ చేసే అవకాశం ఉన్నా కేటీఆర్ పట్టించుకోవట్లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలంటే కలిసి పోరాడాలని రాజగోపాల్ రెడ్డికి చెప్పామన్నారు. బీజేపీలోకి రమ్మని ఆహ్వానించామని, ఆయన ఆలోచిస్తున్నారన్నారు. ప్రజాగోస- బీజేపీ భరోసా యాత్రలో భాగంగా వివేక్ వెంకట్ స్వామి కామారెడ్డి జిల్లా వాజిద్ నగర్ లో పర్యటించారు.
ఇటీవల కాలికి గాయంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న కేటీఆర్.. ఓటీటీలో ఏమైనా సినిమాలుంటే చెప్పాలని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎంటర్ టైన్ మెంట్ కోసం కేటీఆర్ కు సినిమాలు కావాల్సి వచ్చిందా? అని విమర్శిస్తున్నాయి.