
ప్రధాని మోడీ దళితులు, వెనుకబడిన కులాల అభివృద్ధికి కృషి చేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ అణగదొక్కుతున్నారని అన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. SC రిజర్వేషన్లను కేంద్రం మరో 10 ఏళ్లు పొడిగించిన సందర్భంగా నల్గొండలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఆలోచన – నరేంద్ర మోడీ ఆచరణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. దళితులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోని కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు వివేక్ వెంకటస్వామి.