- రాష్ట్రానికి నష్టం చేస్తున్నప్రాజెక్టులపై మౌనం ఎందుకు?
- జగన్ తో ఫ్రెండ్ షిప్ కోసంజనాలను బలిచేస్తున్నడు
- ఇద్దరు సీఎంలకు మధ్యవర్తిగా మేఘా కృష్ణారెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసే పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో కమీషన్లు, జగన్తో ఫ్రెండ్షిప్ కోసం జనాలను బలిచేస్తున్నాడని ఫైరయ్యారు. ఇద్దరు సీఎంలు ఒక్కటేనని, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మంగళవారం రిలీజ్ చేసిన ప్రకటన లో విమర్శించారు. కేసీఆర్, జగన్ ల మధ్య కమీషన్ల వ్యవహారంలో మేఘా కృష్ణారెడ్డి మీడియేటర్గా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీలో మేఘా కంపెనీ ప్రాజెక్టులు కడుతోందని, ఆ కంపెనీకి రాష్ట్రంలో ఇచ్చిన ప్రాజెక్టులను క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత– చేవెళ్లలో సరిగా పనులు చేయకుండానే12 వేల కోట్ల బిల్లులు తీసుకున్న మేఘా కంపెనీకి మళ్లీ లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం అప్పగించారన్నారు. ఏపీలో ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపాడని, గెలిచాక ఇంటికి పిలిపించుకున్నాడన్నారు. ఇద్దరి మధ్య స్నేహం కారణంగానే ఏపీ ప్రాజెక్టులపై సీఎం ఏమీ మాట్లాడలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క కల్వకుంట్ల ఫ్యామిలీనే బాగుపడుతోందని, కమీషన్లు దండుకుని ఫామ్హౌస్లు కట్టుకుంటోందని వివేక్ మండిపడ్డారు.