తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. ఆగస్టు 30న తాను కాంగ్రెస్ లో చేరుతానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాను ఏ పార్టీ నేతలను కలవలేదని స్పష్టం చేశారు. గత రెండు రోజుల నుంచి తాను పుణేలో ఉన్నానని తెలిపారు .
బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని వివేక్ వెంకటస్వామి అన్నారు. గతంలో తాను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వార్తలే వచ్చాయని చెప్పారు. గత కొన్ని రోజులుగా వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.