మాల విద్యుత్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

మాల విద్యుత్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

పాల్వంచ, వెలుగు: తెలంగాణ మాల విద్యుత్​ ఉద్యోగుల  సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2022 క్యాలెండర్ ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా కేంద్రంతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామికి వేంకటేశ్వరుని చిత్రపటం బహూకరించారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు బూర్గుల విజయ భాస్కర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య,  పత్తి శ్రావణ్, శ్రీకాంత్, బద్దం రాహుల్   పాల్గొన్నారు. 

 

ఇవి కూడా చదవండి

జూన్ 2న యాడ్స్ కోసం పెట్టిన ఖర్చెంత?

గజ్వేల్‌‌లో స్పౌజ్ టీచర్ల ఆవేదన సభ

ప్రతి నెల ఒక రోజు పీహెచ్‌‌సీలోనే నిద్రించాలి