కవిత తొందరలోనే జైలుకెళ్తది : వివేక్ వెంకటస్వామి

కవిత తొందరలోనే జైలుకెళ్తది : వివేక్ వెంకటస్వామి

తిరుమల : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ త్వరలోనే అరెస్టు చేస్తుందని బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కామెంట్ చేశారు. లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు వేగంగా జరుగుతోందని చెప్పారు. ఢిల్లీ, పంజాబ్ లో కాకుండా దేశమంతా లిక్కర్ స్కాం చేయాలనుకున్నారని వివేక్ ఆరోపించారు. 

తెలంగాణ ఖజానాను కేసీఆర్ దోచుకున్నాడని వివేక్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో దోచుకున్న అవినీతి డబ్బులతో దేశమంతా తిరుగుతున్నారని, బీఆర్ఎస్ పేరిట కార్యకలాపాలు ప్రారంభించారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్పై వ్యతిరేకత రావడంతో.. ప్రజలను డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టారని వివేక్ ఆరోపించారు. దేశంలో అన్ని పార్టీల కన్నా ఎక్కువ నిధులున్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. ప్రజల సొమ్ముతో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలంటూ రూ.400 కోట్లతో విమానం కొన్నారని ఆయన ఆరోపించారు. రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి.. రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.