జనం కొట్టేరోజులు దగ్గరలోనే ఉన్నయ్

జనం కొట్టేరోజులు దగ్గరలోనే ఉన్నయ్

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నియంతృత్వ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతుందన్నారు. అందుకు నిన్న మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ నేతలు కనబడితే చాలు జనం కొట్టడానికి ఎగబడే రోజు అతి దగ్గరలోనే ఉందన్నారు. 

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో  జరిగిన రెడ్డి సింహగర్జన సభలో వేదికపై నుంచి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అది ఇంతవరకు సాకారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోవడంతో మంత్రిని అతి కష్టం మీద అక్కడి నుంచి కారులో తీసుకెళ్లారు. ఆ సమయంలో రాళ్లు, చెప్పులు, కుర్చీలతో మంత్రి కాన్వాయ్ పై దాడి చేశారు. 

మరిన్ని వార్తల కోసం

కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం చేసినందుకు..

ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే చికిత్స