బాల్క సుమన్ బెదిరింపులకు భయపడొద్దు: సరోజావివేక్

బాల్క సుమన్ బెదిరింపులకు భయపడొద్దు: సరోజావివేక్
  • బాల్క సుమన్​కు బుద్ధిచెప్పండి
  • చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి సతీమణి సరోజ
  • జైపూర్ మండలం పౌనూర్ లో ఇంటింటా ప్రచారం

కోల్​బెల్ట్: ఎమ్మెల్యే బాల్క సుమన్ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి సతీమణి సరోజ అన్నారు. వెంకటస్వామికి మద్దతుగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ లో ఇంటింటా ప్రచారం చేపట్టారు. అంతకుముందు గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే బాల్క సుమన్ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దు. ప్రజలకు మేము అండగా ఉంటం. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజలకు సేవ చేయాలి కానీ బెదిరింపులకు గురి చేయడం సరికాదు. బాల్క సుమన్ ఏ గ్రామానికి రాలేదు. ప్రజా సమస్యలు తెలుసుకోలేదు. ఆయనకు బుద్ధి చెప్పండి.  కాకా వెంకట స్వామి ప్రజలకు ఎల్లవేళల్లో అందుబాటులో ఉన్నరు. అదే బాటలో వివేక్ వెంకట స్వామి నడుస్తుండు. చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామిని గెలిపించాలి’ అని అభ్యర్థించారు.

 చెన్నూరులో కాంగ్రెస్ నుంచి వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్..బీజేపీ నుంచి దుర్గం అశోక్ బరిలోకి దిగుతున్నారు. వివేక్ వెంకటస్వామి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. 

ALSO READ :- 17న బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ చేయనున్న అమిత్ షా