
విశాఖ బీచ్లో వైజాగ్ నేవీ మారథాన్ నిర్వహించారు. ఇవాళ తెల్లవారు జామున నాలుగున్నర గంటలకే 21 కిలోమీటర్లు ఆఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల, 5 కిలోమీటర్ల మారథాన్, 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్లు నిర్వహించారు. వైజాగ్ నేవీ మారథాన్ను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఎన్ఎస్ కళింగ ప్రధానాధికారి లు జెండా ఊపి ప్రారంభించారు. నాలుగు విభాగాల్లో నేవీ మారథాన్ కి 19 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
డిసెంబర్ లో నిర్వహించనున్న నేవీ డే కు ముందుగా క్రమం తప్పకుండా ఈ మారథాన్ నిర్వహిస్తున్నామని తెలిపారు నేవీ స్పోర్ట్స్ వింగ్ కమాండ్ చీఫ్ అమిష్ నాగ్. మొదటి బహుమతి 75 వేలు, రెండో బహుమతి 50 వేలు, మూడో బహుమతి 25 వేల రూపాయలు అందిస్తామని చెప్పారు. ఈ మారథాన్ తో విశాఖ ఖ్యాతి మరింత పెరుగుతుందన్నారు.