యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో ఈ నెల 22న సీఎం కేసీఆర్ఇచ్చిన దావత్ లో బువ్వ తిన్న40 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది వాంతులు.. విరేచనాలతో బాధపడ్డారు. వీరిలో కేసీఆర్తన దోస్తు అని చెప్పుకున్న ఆకుల ఆగవ్వ కూడా ఉన్నారు. ఈ నెల 22న వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ గ్రామసభ నిర్వహించారు. సభలో భాగంగా అదేరోజు ఊరోళ్లందరికీ కేసీఆర్దావత్ఇచ్చారు. ప్రజలతో కలిసి భోజనం చేశారు. అనంతరం సభా వేదికపై తన దోస్త్ ఆకుల ఆగవ్వతో కలిసి భోజనం చేశానని సీఎం చెప్పుకున్నారు. అయితే అదే రోజు సాయంత్రం నుంచి కొందరికి కడుపులో నొప్పి.. మరికొందరికి వాంతులు, విరేచనాలు కావడంతో కంగారు పడ్డారు. వారిలో ఆగవ్వకు బీపీ కూడా పెరగడంతో సోమవారం రాత్రి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్అందించారు. బుధవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వారిలో కొందరు తుర్కపల్లిలో ట్రీట్మెంట్తీసుకోగా.. మరికొందరు వాసాలమర్రిలోని ఆర్ఎంపీ వద్ద ట్రీట్మెంట్తీసుకున్నారు. హెల్త్ స్టాఫ్కూడా వచ్చి టాబ్లెట్లు ఇచ్చారు. అయితే ఈ విషయం బయటపడకుండా జిల్లా ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భువనగిరిలో ట్రీట్మెంట్ చేసిన్రు
సీఎం మీటింగ్లో పాల్గొన్న రోజు సాయంత్రం కడుపులో నొప్పిగా అనిపించింది. విరేచనాలు అయినయ్. తుర్కపల్లికి పోతే బీపీ కూడా పెరిగిందని చెప్పిన్రు. రాత్రి భువనగిరి దవాఖానకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చిన్రు. ఇప్పుడు మంచిగైన. –ఆగవ్వ, వాసాలమర్రి
