కథ విన్నప్పుడే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పిన : చిరంజీవి

కథ విన్నప్పుడే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పిన : చిరంజీవి

కథ విన్నప్పుడే ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ అవుతుందని దర్శకుడు బాబీకి చెప్పినట్లు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అందరి సమిష్టి కృషి చేశారని  అన్నారు. సినిమా అత్యద్భుతంగా వచ్చిందని... ఇందుకు దర్శకుడు బాబీ కారణమన్నారు. చిరంజీవీ హీరోగా బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా మాట్లాడిన చిరంజీవి.. బాస్ పార్టీ పేరిట కొత్త ఏర్పాటు ఉంటుందని చెప్పారు.. కానీ ఇలా సెట్ ఏర్పాటు చేస్తారని అనుకోలేదన్నారు. ఆయా పాత్రలకు ఎవరైతే న్యాయం చేస్తారో బాబీ ముందే నిర్ణయించుకున్నానన్నారు. చంద్రబోస్ అద్భుతమైన పాటలు ఇచ్చారని.. దీనికి అనుకున్నట్లుగానే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చారన్నారు. ఇక సినిమాలో ఫైట్స్ ను రామ్ లక్ష్మణ్ చక్కగా రూపొందించారన్నారు. తనలో ఉన్న స్టైల్ ని కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ పట్టేసుకున్నారన్నారు. హీరోయిన్ గా శృతిహాసన్ చక్కగా నటించిందన్నారు. 

చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్‌‌‌‌ నటిస్తోంది. ఇందులో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మాస్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, విజయ్ ‘వారసుడు’ చిత్రాలు జనవరి 12న రిలీజ్ కానున్నాయి. చిరంజీవి సినిమా జనవరి 13న విడుదల కానుండటంతో.. ఈ మూడింట్లో  సంక్రాంతి విజేత ఏదనే దానిపై ఆసక్తి నెలకొంది.