వనపర్తి జిల్లాలో కొత్త రేషన్​ కార్డులు మంజూరు

వనపర్తి జిల్లాలో కొత్త రేషన్​ కార్డులు మంజూరు
  • జూన్​ నెలలో బియ్యం పంపిణీ ప్రారంభం

వనపర్తి, వెలుగు: కొత్త రేషన్​కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది. కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం, కార్డుల్లో చేరికలు, మార్పులు కోరుతూ చేసుకున్న దరఖాస్తులను పరిశీలన అనంతరం అధికారులు ఆమోదం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను స్ర్కీనింగ్​ చేసి కొత్త కార్డులను జారీ చేస్తున్నారు. మార్పులు, చేర్పులు చేసిన వాటి వివరాలను కీ రిజిస్టర్​లో నమోదు చేస్తున్నారు. ఈ మేరకు కార్డుదారులకు సమాచారం ఇస్తున్నారు. మొదటి విడతలో వనపర్తి జిల్లాలో 1,974 కొత్త రేషన్​కార్డులకు అప్రూవల్​ ఇచ్చారు.

 నెల రోజుల తరువాత ఫిజికల్​ కార్డులు జారీ చేయనున్నారు. మార్పు, చేర్పుల తరువాత కొత్తగా 36,835 మందికి వచ్చే నెల నుంచి రేషన్​ బియ్యం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,57,369 ఫుడ్​ సెక్యూరిటీ కార్డులు ఉండగా, 5,16,962 మందికి బియ్యం కేటాయించారు. రేషన్​కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేస్తామని అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు తెలిపారు.