
వనపర్తి టౌన్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని సోమవారం వనపర్తి జిల్లాకు చెందిన మాల మహానాడు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షులు మొలకపల్లి మద్దిలేటి ఆధ్వర్యంలో హైదరాబాద్లో మంత్రిని కలిసి పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, వివక్షతపై దృష్టి పెట్టాలని మంత్రిని కోరారు. దళితులకు సామాజిక న్యాయం అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంఘం ఉపాధ్యక్షుడు అంబటి రవి కుమార్, కమిటీ సభ్యులు అన్నదాసుల రమేశ్ కుమార్, బూర్గుల నాగరాజు పాల్గొన్నారు.