
పద్మారావునగర్, వెలుగు: అమర్నాథ్ యాత్రపై వార్ ఎఫెక్ట్ పడింది. దేశ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అమర్నాథ్యాత్రకు భక్తులు వెనకడుగు వేస్తున్నారు. శుక్రవారం గాంధీ దవాఖానకు అమర్నాథ్యాత్ర మెడికల్ఫిట్ నెస్సర్టిఫికెట్ కోసం ఒక్కరు కూడా రాకపోవడం గమనార్హం. సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో అమర్నాథ్కు వెళ్లే యాత్రికులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారు. ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే అమర్నాథ్ క్షేత్ర సమీపంలోని చెకింగ్ పాయింట్ల వద్ద కేంద్ర భద్రతా బలగాలు యాత్రకు నిరాకరిస్తారు.
ఈ నేపథ్యంలో గత నెలలో ప్రభుత్వం వివిధ విభాగాల వైద్య అధికారులతో కూడిన బృందంతో గాంధీ దవాఖానలో ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించింది. అమర్నాథ్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం మొదట్లో క్యూ కట్టిన యాత్రికులు పాకిస్తాన్ యుద్ధ భయంతో క్రమంగా తగ్గుతూ వచ్చారు. ఈ నెల 7న బుధవారం కేవలం ఆరుగురు యాత్రికులు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఒక్కరు కూడా మెడికల్ సర్టిఫికెట్కోసం రాలేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే మెడికల్ఫిట్నెస్సర్టిఫికెట్లు తీసుకున్నవారు కూడా అమర్నాథ్యాత్ర వెళ్లడానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.