![దుబాయ్ వెళ్లడానికి ఇళ్లలో వరుస చోరీలు](https://static.v6velugu.com/uploads/2024/05/warangal-ccs-police-arrested-a-thief-who-was-committing-a-series-of-house-burglaries-with-the-target-of-going-to-dubai_PzwRe42F5v.jpg)
దుబాయ్ వెళ్లాలనే టార్గెట్ తో ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను వరంగల్ CCS పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 22లక్షల విలువైన 270 గ్రామలు బంగారు అభరణాలతో పాటు 2 బైక్స్, 50వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని రాజన్న సిరిసిల్ల జిల్లా సంకేపల్లికి చెందిన బైక్ మెకానిక్ జింక నాగరాజుగా గుర్తించారు. వరంగల్, జనగాం, సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని 38పైగా ఇండ్లలో చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.