వరంగల్ ల్యాండ్ పూలింగ్ నిలిపివేత

వరంగల్ ల్యాండ్ పూలింగ్ నిలిపివేత

వరంగల్ ల్యాండ్ ఫూలింగ్ పై వెనక్కి తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం. రైతులు  ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ (కుడా) ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా 10 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

రైతుల ఆందోళనపై ‘కుడా’ కార్యాలయంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్ తోపాటు... వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లతో కుడా చైర్మన్ సుందర్ రాజ్ సమీక్షించారు. రైతుల ఇబ్బందిపై సమావేశంలో చర్చలు జరిపారు. ల్యాండ్ పూలింగ్ పై   రైతుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తుండటంతో ల్యాండ్ పూలింగ్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు కుడా చైర్మన్ సుందర్ రాజ్. 

 

 

 

 

ఇవి కూడా చదవండి

మరోసారి బయటపడ్డ ఇంటర్ బోర్డు తప్పిదం

దేశ ద్రోహం చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు

మీ ఇంటికే బీపీ, షుగర్ గోలీలు