- గుట్ట,రాజాపేటలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని హార్డ్డిస్క్లు స్వాధీనం
యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు: భూ భారతి స్లాట్ బుకింగ్స్కేసులో ఇద్దరు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులను వరంగల్సీసీఎస్పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో భూ భారతి స్లాట్ బుకింగ్స్, రిజిస్ట్రేషన్చార్జీల చెల్లింపుల కేసులో విచారణలో భాగంగా నిందితులను గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
భూముల అమ్మకాలకు భూ భారతి పోర్టల్లో స్లాట్బుకింగ్చేసుకోవాలి. ముందుగా స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్చార్జీలు చెల్లించాలి. మీ సేవ, డాక్యుమెంట్ రైటర్లతో పాటు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు టెక్నాలజీని ఉపయోగించి మోసాలకు పాల్పడుతూ.. స్లాట్బుక్తో పాటు పేమెంట్కూడా చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వ ఖజానాకు డబ్బులు చాలా తక్కువగా జమ అయితున్నట్టు జనగామ జిల్లా ఆఫీసర్లు గుర్తించారు. రూ. లక్ష చెల్లిస్తే రూ. 10 వేలు మాత్రమే వస్తున్నట్టు తేలింది.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పలువురు మీ సేవ సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారించారు. బుధవారం రాత్రి యాదగిరిగుట్టకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు బస్వరాజు వరంగల్ సీసీఎస్పోలీసులు అదుపులోకి తీసుకుని, సీపీయూ, హార్డ్ డిస్క్లు, ప్రింటర్ను సీజ్చేసి తీసుకెళ్లారు. శుక్రవారం రాజాపేటకు చెందిన మరో ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు పాండును అరెస్ట్ చేశారు. వరంగల్సీసీఎస్ పోలీసులు బస్వరాజును తీసుకెళ్లినది నిజమేనని, పూర్తి వివరాలు తెలియదని యాదగిరిగుట్ట పోలీసులు తెలిపారు.
