మూడు నెలలుగా అత్యాచారం.. తండ్రిని కాల్చి చంపిన 14ఏళ్ల బాలిక

మూడు నెలలుగా అత్యాచారం.. తండ్రిని కాల్చి చంపిన 14ఏళ్ల బాలిక

దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో గత మూడు నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ 14 ఏళ్ల పాకిస్థాన్ బాలిక తన తండ్రిని కాల్చి చంపిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 23 న చోటు చేసుకుంది.

లాహోర్ నగరంలోని గుజ్జర్‌పురా ప్రాంతంలో ఈ సంఘటనలో జరగ్గా.. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె కీలక విషయాలు వెల్లడించింది. తన తండ్రి గత మూడు నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని చెప్పింది. "తాను నరకం అనుభవించానని, అత్యాచారం చేసిన తన తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నానని, అందుకే అతన్ని తుపాకీతో కాల్చి చంపానని చెప్పింది" అని కేసు దర్యాప్తు చేస్తున్న సోహైల్ కజ్మీ చెప్పారు. దీంతో బాలిక తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు కజ్మీ తెలిపారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత నిందితుడిపై కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. తన మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పాకిస్థాన్ కోర్టు మరణశిక్ష విధించిన ఒక రోజు తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. కుమార్తెపై అత్యాచారం చేసిన నిందితుడు ఎం. రఫీక్‌కు లాహోర్‌లోని జెండర్ బేస్డ్ వాయిలేన్స్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి మియాన్ షాహిద్ జావేద్ మరణశిక్ష విధించారు.