పటాన్ చెరులో దారుణం.. నిద్రిస్తున్న జంటను హత్యచేసిన దుండగులు

పటాన్ చెరులో దారుణం.. నిద్రిస్తున్న  జంటను హత్యచేసిన దుండగులు

సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరులో  జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు మున్సిపాలిటీలో పరిధిలోని సీటిజెన్​ కాలనీలో నిర్మాణంలో  భవనం వాచ్​ మెన్​గా భార్యభర్తలను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతులు  సోమ్లాదశరధ్​(50), మాన్యమ్మ(45)గా  పోలీసులుగుర్తించారు. 

గత కొంతకాలంగా  పటాన్ చెరు పరిధిలోని  సిటిజెన కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనానికి సోమ్లా ధశరథ్​వాచ్​ మెన్​ గా పనిచేస్తున్నాడు. భార్య మాన్యమ్మతోపాటు అక్కడే నివాసం  ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం (మార్చి14)  ఉదయంం వారు నివసిస్తున్న గుడిసెలో  శవాలై కనిపించారు.  

మృతులు దశరథ్​, మాన్యమ్మపై  పదునైన  ఆయుధాలతో దాడి చేసినట్లు కనిపిస్తుంది. ఇద్దరినీ తలపై మోదడంతో ముఖాలు చిద్రమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, క్లూస్​ టీం ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.