చెత్త, మురుగు సమస్యల పరిష్కారానికి.. సమన్వయంతో పని చేద్దాం: వాటర్​బోర్డు, జీహెచ్ఎంసీ నిర్ణయం

చెత్త, మురుగు సమస్యల పరిష్కారానికి.. సమన్వయంతో పని చేద్దాం: వాటర్​బోర్డు, జీహెచ్ఎంసీ నిర్ణయం
  • యాకుత్​పురాలో బల్దియా క‌‌మిష‌‌న‌‌ర్‌‌, వాటర్​ బోర్డు ఎండీ ఇన్‌‌స్పెక్షన్‌‌
  •  ఎమ్మెల్యేతో క‌‌లిసి నియోజ‌‌క‌వ‌‌ర్గంలో ప‌‌ర్యట‌‌న‌‌

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీలోని మురుగు, చెత్త సమస్యలపై వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ సమన్వయంతో పని చేయాలని నిర్ణయించాయి. బల్దియా కమిషనర్​కర్ణన్, వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి కలిసి శుక్రవారం యాకుత్‌‌పురా నియోజ‌‌క‌‌వ‌‌ర్గంలో ఎమ్మెల్యే జాఫర్​హుస్సేన్​తో కలిసి పర్యటించారు. మురుగునీటి స‌‌మ‌‌స్య శాశ్వత‌‌ ప‌‌రిష్కారానికి రెండు శాఖల ఆధ్వర్యంలో జాయింట్​యాక్షన్​తీసుకోవాలని నిర్ణయించారు. మౌలానా చిల్లా ప్రాంతంలోని గంగాన‌‌గ‌‌ర్ నాలా ప‌‌రివాహ‌‌క ప్రాంతంలో వ‌‌ర్షాకాల టైంలో మురుగు ఇండ్లలోకి చేరుతోందని స్థానికులు అధికారుల దృష్టి తెచ్చారు. 

ఈ ప్రాంతంలో రోడ్డు విస్తర‌‌ణ, బల్దియా నాలా విస్తర‌‌ణ ప‌‌నుల కార‌‌ణంగా రెయిన్‌‌ వాట‌‌ర్ డ్రైన్లు, సీవ‌‌రేజ్ లైన్లలో పూడిక పెరిగి వర్షం వస్తే మురుగు స‌‌మ‌‌స్య తీవ్రమవుతోందన్నారు. స్పందించిన అధికారులు ఏక‌‌కాలంలో నాలాలు, సీవ‌‌రేజ్ లైన్లలో పూడిక‌‌ తీస్తే స‌‌మ‌‌స్య తీరుతుందన్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల కింది నుంచి నాలాలు ప్రవహిస్తున్నాయని తెలుసుకున్న ఆఫీసర్లు.. నాలాల‌‌ ప‌‌నులు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాల‌‌ని అధికారుల‌‌ను ఆదేశించారు. నాలా విస్తర‌‌ణ ప‌‌నుల టైంలో స‌‌మాంత‌‌రంగా వాటర్​బోర్డు సీవ‌‌రేజ్ లైన్ల నిర్మాణం పూర్తి చేయాల‌‌ని అశోక్ రెడ్డి ఆదేశించారు.