
- అల్ట్రాసోనిక్ జీఎస్ఎం టెక్నాలజీతో పని చేయనున్న మీటర్లు
- నెలకు రూ.100 కోట్లు వస్తే.. ఐటీ కారిడార్ నుంచే రూ. 80 కోట్లు
- అందుకే అధికారుల స్పెషల్ ఫోకస్
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో అత్యధికంగా నీటి బిల్లులు వసూలయ్యే ప్రాంతాలపై వాటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతమున్న మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు బిగించాలని అధికారులు నిర్ణయించారు. ఇవి ఆటోమేటిక్గా బిల్లులు జనరేట్ చేస్తాయని, ట్యాంపరింగ్ చేసే అవకాశం కూడా ఉండదంటున్నారు. దీంతో సరఫరా చేసిన నీటికి వందశాతం బిల్లులు వసూలు చేయవచ్చంటున్నారు. అన్ని ఏరియాలతో పోలిస్తే ఐటీ కారిడార్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, మాదాపూర్, నార్సింగి, మియాపూర్, శేరిలింగం పల్లి వంటి ప్రాంతాల్లో బిల్లులు వందశాతం వసూలవుతున్నాయని, బోర్డుకు రూ.13.80 లక్షల కనెక్షన్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వస్తే.. ఒక్క ఐటీ కారిడార్ నుంచే రూ. 80 కోట్లు వసూలు అవుతున్నాయని అంటున్నారు.
అలాగే, ఈ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు పెరుగుతున్నాయని, సింగిల్విండో సెల్కు కొత్త కనెక్షన్ల కోసం వస్తున్న దరఖాస్తుల్లో అధికశాతం వెస్ట్సిటీ నుంచే ఉంటున్నాయని చెప్తున్నారు. అందుకే స్పెషల్ఫోకస్పెట్టామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కనెక్షన్చార్జీలతో పాటు, మీటర్చార్జీలు కూడా తీసుకుంటున్నారు. 5 వేల కనెక్షన్లకు సంబంధించి మీటర్లకు అధికారులు ముందే డబ్బులు తీసుకున్నారు.
అల్ట్రాసోనిక్ జీఎస్ఎం టెక్నాలజీ
వెస్ట్సిటీలోని ఆయా ప్రాంతాల్లో మల్టీస్టోరుడ్బిల్డింగ్స్ (ఎంఎస్బి) కమర్షియల్కనెక్షన్లకు స్మార్ట్మీటర్లను అమర్చాలని అధికారులు నిర్ణయించారు. ఇవి అల్ట్రా సోనిక్ జీఎస్ఎం టెక్నాలజీతో పని చేస్తాయి. వీటి కోసం పలు కంపెనీల నుంచి ఎక్స్ప్రెషన్ఆఫ్ఇంట్రెస్ట్(ఈఓఐ) కోసం టెండర్లను ఆహ్వానించారు. మొదటి విడతగా 6 వేల మీటర్లను కొనాలనుకుంటున్నారు. ఈ మీటర్లను సరఫరా చేసే సంస్థలు వాటిని బిగించడంతో పాటు, నిర్ణీత కాల పరిమితి వరకూ బిల్లింగ్రెయిజ్చేయడం, మీటర్ల మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలనెలా బిల్లులను మాన్యువల్గా అందజేస్తుండగా, స్మార్ట్మీటర్లు పెట్టాక హెడ్డాఫీసు లోని డాష్ బోర్డు నుంచి రీడింగ్చూసి నేరుగా బిల్లులను జనరేట్చేయొచ్చు.
ఏఎంఆర్ మీటర్లలో అవకతవకలతో..
ఇప్పటి వరకూ గ్రేటర్పరిధిలో ఆటోమేటిక్మీటర్ రీడింగ్(ఎఎంఆర్) మీటర్లను పూర్తి స్థాయిలో బిగించాలని అనుకున్నా సక్సెస్కాలేకపోయారు. కొందరు అధికారులు మీటర్లు సరఫరా చేసే సంస్థలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. టాంపరింగ్చేయడం, మీటర్ల కొనుగోలు, మెయింటెనెన్స్లో వచ్చిన సాంకేతిక ఇబ్బందులతో ఆయా కంపెనీలకు ఉన్నతాధికారులు నోటీసులిచ్చారు. బిల్లుల వసూళ్లలో తేడా వస్తుండడంతో ఎఎంఆర్ మీటర్లపై వెనక్కి తగ్గారు. ఈ క్రమంలోనే వెస్ట్సిటీలో స్మార్ట్మీటర్లను ఏర్పాటు చేసే ప్రతిపాదన చేశారు. రాబోయే కాలంలో ఔటర్ రింగ్రోడ్ అవతల కూడా నీటి సరఫరా చేసేందుకు ప్రపోజల్స్వస్తుండడంతో ఈ కొత్త మీటర్లను ఉపయోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు.